1, సెప్టెంబర్ 2018, శనివారం

సంతోషించారు కానీ - వాళ్ళకు ప్రయోజనం లేకపోయింది


 
1960లలో, కమ్యూనిష్టు పార్టీ రెండు ముక్కలు అవ్వటం వాళ్ళ దృష్టిలో ఒక పెద్ద చారిత్రాత్మక ఘట్టం అనుకుంటారు కానీ, అలా జరగటం మన దేశంలో  ఎవ్వరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎదో కమ్యూనిష్టులు అనే కాని, రెండు ముక్కలు అయినా, ఆతరువాత ఎన్ని ముక్కలు అయ్యినా పెద్దగా ప్రజల్లో  "గణింపు" లేకపోయింది. కానీ అప్పటికే, స్వతంత్రం  వచ్చిన దగ్గరనుండీ దేశాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్, 1969 లో కుటుంబ పాలన కోసం రెండు ముక్కలు అయ్యింది. అలా రెండు ముక్కలు కావటానికి ఎవరు కారణమో అందరికీ తెలుసు.

ఇలా కాంగ్రెస్ రెండు ముక్కలు కావటం తమకేదో లాభిస్తుందని కమ్యూనిష్టులు భావించారని ఊమెన్ గారు వేసిన కార్టూన్. తాము అప్పటికే రెండు ముక్కలు అయ్యి, ఉన్న కాస్త బలం పోయి, బలహీనపడి తమ సంగతి చూసుకోకుండా వేరే పార్టీ రెండు ముక్కలు అవటాన్ని సంతోషంగా చెప్పుకోవటం పెద్ద జోకు. 

అప్పటికి అంటే జనవరి 1970 కి కాగ్రెస్ రెండు ముక్కలయ్యి జస్ట్ కొన్ని నెలలు మాత్రమె అవటం వలన, ఆయన వేసిన కార్టూన్ లో వాళ్ళు అలా సంతోషిస్తూ కనిపిస్తున్నట్టు వేశారు.  కానీ తరువాత్తరువాత జరిగిన ఎన్నికల పరిణామాలు పరిశీలిస్తే, కాంగ్రెస్ కు ఏమైనా, కమ్యూనిష్టులకు మాత్రం లాభం జరగలేదన్న విషయం తెలుస్తుంది. కాకపొతే, కాంగ్రెస్ చేసిన కొన్ని కొన్ని తప్పిదాల వల్ల, బెంగాల్ లో మాత్రం, కమ్యూనిష్టు ముక్కల్లో ఒకటి,  మూడు దశాబ్దాలు తమ "కబ్జా" పెట్టగలిగారు.

కామెంట్‌లు లేవు: