1, సెప్టెంబర్ 2018, శనివారం

భూసంస్కరణలు!

కాంగ్రెస్ తమను తాము ప్రభుత్వంలో ఎల్లకాలమూ ఉంచుకోవటానికి తెచ్చిన ఒక "సద్దుపాటు" సంస్కరణ భూ సంస్కరణ. ఎదో సోషలిష్టు వ్యవస్థ తీసుకువస్తున్నట్టు నటిస్తూ, నిజానికి ఏమీ చెయ్యనివి ఈ భూ సంస్కరణలు. బాంకు పరీక్షల్లో బారతీయ ఆర్ధిక సమస్యల గురించి చదువుకున్నప్పుడు తెలిసింది, దేశంలోకెల్లా అత్యధిక విడాకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఇవ్వబడ్డాయట. కారణం, విడాకులు తీసుకుంటే, రెండు యూనిట్ల కింద లెక్కేసి ఎక్కువ భూమి ఆ కుటుంబానికి ఉంటుంది.

అదీ కాక, ఈ సంస్కరణలు తీసుకు వచ్చినది కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ పార్టీ వారు కాని, కాంగ్రెస్ భక్తులు కానీ పెద్దగా ఈ సంస్కరణలను పాటించినట్టు కనపడదు. ఎవరికి వాళ్ళు సద్దుకున్నారు కానీ, సంస్కరణల్లో భూమి ఇచ్చిన కాంగ్రెస్ సమర్ధకులు కరువయ్యారు. ఎక్కడన్నా ఒకళ్ళో-ఇద్దరో అమాయకులు బలి అయిపోయి ఉండొచ్చు.

ఆంధ్ర ప్రదేశ్ లో, అప్పట్లో ముఖ్య మంత్రి పి వి నరసింహారావు తీసుకు వచ్చిన  భూ సంస్కరణలను దెబ్బ తియ్యటానికి,1972-73లోప్రత్యెక ఆంధ్ర ఉద్యమం తీసుకు వచ్చారని ఒక పుకారు ఉన్నది.  

కామెంట్‌లు లేవు: